18 Aug
|
Kalam Daily
|
Lakhtar
18 Aug
Kalam Daily
Lakhtar
Friday, August 14, 2026
Homeలైఫ్ స్టైల్కెరీర్
రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు!
By Kalam Desk
4 August 2026, 4:02 pm
కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగియనుంది. నవంబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. https://rrbsecunderabad.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ పరిధిలో అయిదు పోస్టులు..
సికింద్రాబాద్ జోన్ పరిధిలో అయిదు పోస్టులు కేటాయించారు. రైళ్ల నిర్వహణలో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. దీనిలో సెలెక్ట్ అయితే ఎప్పటికప్పుడు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మెంట్ నాటికి డివిజన్ కంట్రోలర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.35 వేల వేతనం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు, రైల్వే పరంగా వర్తించే ఇతర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి.
డిగ్రీ అర్హతతోనే..
సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. పాసైన వారు అప్లై చేసుకోచ్చు. అయితే, అభ్యర్థి వయస్సు 20-33 మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. వెబ్సైట్లో వివరాలు పరిశీలించి.. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండు దశల్లో పరీక్ష..
సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపినవారిని ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో కూడా రాణించినవారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయ్యాక.. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
సబ్జెక్టులు ఇవే..
ప్రిలిమ్స్ పరీక్షలో మ్యాథ్స్ అప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్, లాజికల్ కేపబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతుంటారు. మెయిన్స్ పరీక్షలో విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్, సైకోమాటిక్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అభ్యర్థులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయడంతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. దీని వలన ప్రశ్నల సరళి అర్థమవుతుంటుంది.
- Tags
- Railway Jobs
- RRB
- Section Controller Posts
- Secunderabad
Facebook X
WhatsApp
Copy URL
మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి
Previous article
వర్షాకాల వ్యాధుల నియంత్రణపై వనపర్తి DMHO కీలక ఆదేశాలు
Next article
మిస్సింగ్ మహిళకు కరీంనగర్ పోలీసులు భరోసా
లేటెస్ట్ న్యూస్
శర్వాతో శ్రీనువైట్ల కొత్త సినిమా షురూ!
వాలీబాల్ క్రీడాకారిణి అనన్యకు మంత్రి సన్మానం
51 ఏళ్ల నిరీక్షణకు ముగింపు కావాలి: మన్ ప్రీత్ సింగ్
కరీంనగర్ అదనపు డీసీపీ వెంకట రమణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
స్వాతంత్య్ర వేడుకలకు పాలమూరులో ఘనంగా ఏర్పాట్లు
Read More Latest News >>
ఎక్స్క్లూజివ్
రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొత్త స్మార్ట్ రేషన్కార్డులు పంపిణీ
గ్రేటర్లో ‘సర్’ ఎఫెక్ట్.. గులాబీ పార్టీకి గుబులు!
నల్లగొండ డీఎంహెచ్వోలో నయా దందా.. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు వసూలు
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మంటలు
GHMC ఎన్నికల్లో ఏ పార్టీలకి SIR ఎసరు..?
Read More Exclusive Stories >>
Homeలైఫ్ స్టైల్కెరీర్
రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు!
By Kalam Desk
4 August 2026, 4:02 pm
కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగియనుంది. నవంబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. https://rrbsecunderabad.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ పరిధిలో అయిదు పోస్టులు..
సికింద్రాబాద్ జోన్ పరిధిలో అయిదు పోస్టులు కేటాయించారు. రైళ్ల నిర్వహణలో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. దీనిలో సెలెక్ట్ అయితే ఎప్పటికప్పుడు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మెంట్ నాటికి డివిజన్ కంట్రోలర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.35 వేల వేతనం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు, రైల్వే పరంగా వర్తించే ఇతర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి.
డిగ్రీ అర్హతతోనే..
సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. పాసైన వారు అప్లై చేసుకోచ్చు. అయితే, అభ్యర్థి వయస్సు 20-33 మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. వెబ్సైట్లో వివరాలు పరిశీలించి.. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండు దశల్లో పరీక్ష..
సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపినవారిని ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో కూడా రాణించినవారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయ్యాక.. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
సబ్జెక్టులు ఇవే..
ప్రిలిమ్స్ పరీక్షలో మ్యాథ్స్ అప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్,
లాజికల్ కేపబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతుంటారు. మెయిన్స్ పరీక్షలో విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్, సైకోమాటిక్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అభ్యర్థులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయడంతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. దీని వలన ప్రశ్నల సరళి అర్థమవుతుంటుంది.
కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగియనుంది. నవంబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. https://rrbsecunderabad.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ పరిధిలో అయిదు పోస్టులు..
సికింద్రాబాద్ జోన్ పరిధిలో అయిదు పోస్టులు కేటాయించారు. రైళ్ల నిర్వహణలో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. దీనిలో సెలెక్ట్ అయితే ఎప్పటికప్పుడు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మెంట్ నాటికి డివిజన్ కంట్రోలర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే రూ.35 వేల వేతనం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు, రైల్వే పరంగా వర్తించే ఇతర అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి.
డిగ్రీ అర్హతతోనే..
సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. పాసైన వారు అప్లై చేసుకోచ్చు. అయితే, అభ్యర్థి వయస్సు 20-33 మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. వెబ్సైట్లో వివరాలు పరిశీలించి.. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండు దశల్లో పరీక్ష..
సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపినవారిని ఒక్కో పోస్టుకు 8 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో కూడా రాణించినవారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయ్యాక.. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
సబ్జెక్టులు ఇవే..
ప్రిలిమ్స్ పరీక్షలో మ్యాథ్స్ అప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్, లాజికల్ కేపబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతుంటారు. మెయిన్స్ పరీక్షలో విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్, సైకోమాటిక్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అభ్యర్థులు వీలైనన్ని మాక్ టెస్టులు రాయడంతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. దీని వలన ప్రశ్నల సరళి అర్థమవుతుంటుంది.
- Tags
- Railway Jobs
- RRB
- Section Controller Posts
- Secunderabad
Previous article వర్షాకాల వ్యాధుల నియంత్రణపై వనపర్తి DMHO కీలక ఆదేశాలు
Next article
మిస్సింగ్ మహిళకు కరీంనగర్ పోలీసులు భరోసా
📌 రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar